ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఫాతిమాను కూటమి నాయకుల బెదిరింపులకు గురిచేయడం మూలంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫాతిమాబేగంను ఉద్యోగం నుంచి తొలగించి, తమ అనుచరులను ఆ స్థానంలో నియమించేందుకు జనసేన, టీడీపీ నేతలు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒత్తిడిని భరించలేక ఫాతిమాబేగం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఫాతిమా బేగంకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.