ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో భోజనం తక్కువగా, నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అర్ధరాత్రి సమయంలోనే యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దకు వచ్చి ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం’ అంటూ నినదిస్తూ ఖాళీ కంచాలను నేలపై కొడుతూ తమ ఆకలి బాధను తీర్చాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విద్యార్థుల చెబుతున్న వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు హాస్టళ్ల నిర్వాహకులకు తెలిపారు. దీనిపై ఎవరూ పట్టించుకోకపోగా రాత్రి భోజనం కూడా పరిశుభ్రత లోపించడంతో ఆందోళనకు దిగారు. హాస్టల్ భోజనంలో నాణ్యత ఉండటం లేదని, తినడానికి కూడా వీల్లేకుండా ఉంటుందని వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పూ లేకపోవడంతో నిరసనకు దిగామని వారు అంటున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళన అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీనిపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు కలగజేసుకొని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
భోజనంలో జెర్రి
— Telugu Feed (@Telugufeedsite) March 13, 2025
ఏయూ మెయిన్ గేట్ వద్ద ఖాళీ కంచాలతో విద్యార్థుల ఆందోళన..
అర్ధరాత్రి వరకు కొనసాగిన యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..#AndhraPradesh #AndhraUniversity pic.twitter.com/7FKAB44EQh