ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నేతల మాటలకు భిన్నమైన కోణాన్ని చూపిస్తున్నాయి. మంత్రుల పీఏల సెటిల్మెంట్లు, పార్టీ నేతల కమిషన్ల దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విడాకుల కేసులోనూ పర్సెంటేజీలేనా?
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యక్తిగత సహాయకుడు (PA)పై హరీశ్ అనే బాధితుడు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తనకు 2 ప్లాట్లు, రూ. 30 లక్షల నగదు, ఒక 2BHK ఇల్లు ఇవ్వకపోతే విడాకుల కేసు ముందుకు సాగనివ్వనని మంత్రి పీఏ బెదిరిస్తున్నట్లు బాధితుడు వీడియో ద్వారా వాపోయాడు. ఈ ఆగడాలు మంత్రిగారికి తెలియకుండానే జరుగుతున్నాయా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు మీడియా ముఖంగా సుద్దులు చెప్పే పయ్యావుల, తన సొంత కార్యాలయంలో జరుగుతున్న ఈ సెటిల్మెంట్లపై ఏం సమాధానం చెబుతారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చివరికి విడాకుల కేసుల్లో కూడా వసూళ్లా..?
— Telugu Feed (@Telugufeedsite) April 13, 2026
మంత్రి పయ్యావుల పీఏ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్న బాధితుడు
2 ప్లాట్లు, రూ.30 లక్షలు, 2 BHK హౌస్ తనకు ఇవ్వకపోతే విడాకుల కేసు ముందుకు పోదు అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ పీఏ బెదిరిస్తున్నారని వాపోయిన హరీశ్ అనే వ్యక్తి pic.twitter.com/Ep3yx899yB
CMRFలో ‘తెలుగు తమ్ముళ్లు’ చేతివాటం
రాజంపేటలో జరిగిన మరో ఘటన మానవత్వాన్ని మంటగలిపేలా ఉంది. రోడ్డు ప్రమాదంలో కన్ను కోల్పోయిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ. 14 లక్షలు మంజూరు చేసింది. సహాయం చేస్తామని బ్యాంక్కు తీసుకెళ్లిన TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మరియు ఇతర నేతలు, బాధితుడితో సంతకాలు చేయించుకున్నారు.
ఎల్లయ్య ఖాతాలో రూ. 14 లక్షలు జమ అయిన 20 నిమిషాల్లోనే, అందులో నుంచి రూ. 8 లక్షలను నేతలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. దీనిపై నిలదీస్తే “మాకు ఖర్చులు ఉంటాయి, అందరికీ పర్సెంటేజీలు ఇవ్వాలి” అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. అవినీతికి కప్పిపుచ్చుకునేందుకు అప్పు అంటూ ఓ ప్రామీసరీ నోటు బయటపెట్టినా, అది నకిలీ అని ఎల్లయ్య బావమరిది స్టేట్మెంట్తో దొరికిపోయారు.
సీఎం రిలీఫ్ ఫండ్ లో @JaiTDP నేతల చేతివాటం
— Telugu Feed (@Telugufeedsite) April 8, 2026
బాధితుడికి వచ్చిన రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు తమ అకౌంట్లో వేసుకున్న TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
రాజంపేటలో తెలుగు తమ్ముళ్ళ నిర్వాకం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్న తుంటి ఎల్లయ్య
బాధితునికి… pic.twitter.com/Gw8MN4JewJ
బెల్ట్ షాపుల దందా.. ఏకంగా ఎమ్మెల్యేకే వార్నింగ్
తిరువూరు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఇంచార్జ్ శావల దేవదత్ ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించే స్థాయికి వెళ్లారు. “రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఎలా నడుస్తున్నాయో ఇక్కడ కూడా అలాగే నడుస్తాయి.. అడ్డుకోవడానికి నువ్వు ఎవడివి? నీ ఇంటికి వచ్చి తంతా” అంటూ ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ షాపుల దందాను బహిరంగంగానే సమర్థించుకోవడం చూస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతల పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
కొలికపూడి శ్రీనివాస్ నీ ఇంటికొచ్చి తంతా
— Telugu Feed (@Telugufeedsite) April 13, 2026
బెల్టు షాపులు అడ్డుకోడానికి నువ్వు ఎవడి..
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి కేశినేని చిన్ని వర్గం వార్నింగ్
ఎమ్మెల్యే ని ఇంటికొచ్చి తంతా అంటూ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ తిరువూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దేవదత్
బెల్ట్ షాపుల్ని నువ్వు… pic.twitter.com/TFKNPnCkVj
ప్రజల ఆగ్రహం
మంత్రుల పీఏల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు ‘కాదేదీ అవినీతికి అనర్హం’ అన్నట్లుగా ప్రవర్తిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. సీఎంఆర్ఎఫ్ వంటి పవిత్ర నిధుల్లో కూడా వాటాలు వెతుక్కోవడం దారుణమని, తక్షణమే ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.








