దేశ సర్వోన్నత న్యాయస్థానం (Court) ఆదేశాలను కూటమి ప్రభుత్వం (Coalition Government) బేఖాతరు చేస్తుందా..? కోర్టు గైడ్లైన్స్ (Court Guidelines)ను పట్టించుకోకుండా ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనలలో ప్రధానమంత్రి (Prime Minister) ఫోటోతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి (StateChief Minister), రాష్ట్ర గవర్నర్ (State Governor) ఫోటో మాత్రమే వాడాలి. ఇతర మంత్రులు లేదా డిప్యూటీ సీఎం వంటి రాజ్యాంగబద్ధమైన హోదా లేని పదవుల్లో ఉన్నవారి ఫోటోలను చేర్చకూడదని స్పష్టం చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘించిందని నిపుణులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చిన ”అపూర్వ యోగా సంగమం
” ప్రకటనలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ఫోటోలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫోటోలను ప్రచురించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ఇతర మంత్రులను అవమానించడమే కాక, ప్రజాధనాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రచారం కోసం దుర్వినియోగం చేయడమని విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల నారా లోకేష్ను రాజకీయంగా ప్రమోట్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో సమానంగా పబ్లిసిటీ కల్పిస్తోందని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పోలిస్తే లోకేష్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. లోకేష్ నిర్వహించిన ఒక సమావేశానికి చీఫ్ సెక్రటరీ హాజరవ్వడం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రకటనలలో లోకేష్ ఫోటోలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని, ఇది కూటమిలో అసమ్మతిని రేకెత్తించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉల్లంఘన వివాదాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమలుపై చర్చకు దారితీస్తోందని విశ్లేషకులు అంటున్నారు.