భారతదేశానికి (India) భారీ శుభవార్త! అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో (Andaman and Nicobar Sea) గయానా (Guyana) తరహా భారీ చమురు నిక్షేపాలను (Oil Reserves) కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం (Petroleum), సహజ వాయువు (Natural Gas) శాఖ (Ministry) మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వెల్లడించారు. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
భారీ ఆర్థిక వృద్ధికి అవకాశం:
ఈ చమురు నిక్షేపాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా (Oil India), ఓఎన్జీసీ (ONGC) అండమాన్ సముద్రంలో చమురు, సహజవాయువు కోసం తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగొన్నంత పెద్ద మొత్తంలోనే అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని, అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్ల వరకు విస్తరించడంలో సహాయపడతాయని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే, అక్కడ చమురు నిల్వలను వెలికి తీయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు.
వెలికితీత ఖర్చులు, టెక్నాలజీ:
ఒక్కో బావి (Well)ని తవ్వడానికి (Drill) దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని మంత్రి పేర్కొన్నారు. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చిందని, దాని కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారని హర్దీప్ సింగ్ వెల్లడించారు. అక్కడ ఒక్కో బావికి 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ (ONGC) చమురు(Oil), గ్యాస్(Gas) నిక్షేపాల కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు.
ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు:
అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు (సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం) ఉన్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలను వెలికి తీశారు. అక్కడ హెచ్ఎస్ కార్పొరేషన్, చైనాకు చెందిన సీఎన్ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది. అండమాన్లో ఈ నిక్షేపాలను పూర్తిస్థాయిలో వెలికి తీయగలిగితే, భారతదేశ ఆర్థిక భవిష్యత్తుకు ఇది ఒక భారీ బూస్ట్ అవుతుంది.