రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం (Forest Area) పెంచాలని, ప్రస్తుతం 39 శాతం ఉన్న అడవులను 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజలకు సూచించారు. తుళ్ళూరు (Tulluru) మండలం, అనంతవరం (Ananthavaram) గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై స్టాళ్లను పరిశీలించారు. సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు.
నా కార్యక్రమాలతో రామయ్య స్ఫూర్తిపొందాడు..
సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో వనజీవి రామయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్య (Vanajeevi Ramayya) తన దగ్గరకి ఎప్పుడూ వచ్చేవాడని, ఊరూరు తిరిగి విత్తనాలు పంచి, ప్రతి సంవత్సరం వచ్చి తనకు రిపోర్టు చేసేవాడని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న కార్యక్రమాల నుంచి స్ఫూర్తిపొంది, ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్కనాటేవాడు, పౌరులతో నాటించేవాడన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రామయ్య ప్రస్తానం..
ఖమ్మం జిల్లా (Khammam District) రెడ్డిపల్లి గ్రామానికి (Reddipalli Village) చెందిన దరిపల్లి రామయ్య (Daripalli Ramayya) విపరీతంగా మొక్కలను పెంచడం వల్ల వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వమే మెచ్చింది. 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తన జీవితంలో కోటికిపైగా మొక్కలు (Trees) నాటిన వ్యక్తిగా వనజీవి రామయ్య ఘనత పొందారు.
వనజీవి రామయ్య చదువుకునే సమయంలో తన పాఠశాల ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభాలు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. రామయ్యకు ఉన్న 40 కుంటల స్థలంలో తాను నివసించే ఇల్లు పోను మిగతా భాగంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాడు. అప్పటి నుంచి రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య మొక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలని కోరేవారు.
రామయ్య 60 సంవత్సరాల వయస్సులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి, మొక్కలు పెంచి, పదిమందికి పంచుతుంటారు. వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరించి ప్రకృతి ప్రేమికులకు పంచేవారు. దరిపల్లి రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 2025 ఏప్రిల్ 12నమరణించాడు.
- రామయ్య చేస్తున్న సేవలకు గుర్తింపు
- 2017 సంవత్సరానికి పద్మశ్రీ (సామాజిక సేవ)
- 2005 సంవత్సరానికి సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర
- యూనివర్సల్ గ్లోబల్ పీస్ ’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్
- 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు
- ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు
పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రతి నా దగ్గరకు వచ్చి ఎన్ని మొక్కలు నాటారో రిపోర్ట్ చేసేవాడు
— Telugu Feed (@Telugufeedsite) June 5, 2025
: – సీఎం చంద్రబాబు#AndhraPradesh #EnvironmentDay #EnvironmentDay2025 #ChandraBabu #VanajeeviRamaiah pic.twitter.com/q4WB8pO0Z6