ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ (NDRF), నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కూడా పాల్గొన్నారు. సభావేదికపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కార్యకలాపాలు వివరించే ఏవీని ప్రదర్శించారు అధికారులు. దేశంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు 16 బెటాలియన్లు ఉండగా.. గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కావడం విశేషం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాసవర్మతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేశ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యాలయాలు విపత్తు నిర్వహణలో మరింత ప్రతిస్పందన కల్పించేలా పని చేయనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment