అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్, మస్క్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్, మస్క్ సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా జరిగిన వరుస ప్రమాదాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్‌న‌కు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో సంభవించిన పేలుడు 16 మందిని బలిగొన్నది. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.

మస్క్ అనుమానాలు
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఘటనలపై ఎక్స్ (ట్విట్టర్) వేదిక‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని అనిపిస్తోంది. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోంది. రెండు కార్లను ఒకే టూర్ రెంటల్ వెబ్‌సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారు. ఈ పరిణామాలను మా సీనియర్ బృందం విశ్లేషిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, లాస్ వెగాస్ ఘటన టెస్లా వాహనంలో ఉన్న సమస్య వల్ల కాదు, పేలుడు పదార్థాల వల్లే జరిగిందని స్పష్టంచేశారు.

ట్రంప్ మండిపాటు
ఈ ప్రమాదాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. వలసల కారణంగా అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. “నేను వలసల వల్ల నేరస్థుల సంఖ్య పెరుగుతుందని ముందే హెచ్చరించా. ఈ వరుస ఘటనలు నా మాటలను నిజం చేస్తున్నాయి. ప్రమాదాల్లో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సామాజిక, రాజకీయ ప్రభావం
ఈ వరుస ఘటనలు అమెరికాలో రాజకీయ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. వలసలపై డిబేట్ మరింత పెరుగుతుండగా, టెక్నాలజీపై సమీక్షలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment