ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని అల్లు బిజినెస్ పార్క్లో అనుమతులకు మించి పెంట్హౌస్ నిర్మించారని. దీనిపై అధికారులు నోటీసులు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నం. 45లో ఉన్న ఈ భవనానికి జీహెచ్ఎంసీ నుంచి నాలుగు అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే, తాజాగా అదనంగా ఒక పెంట్హౌస్ నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అక్రమంగా నిర్మించిన పెంట్హౌస్ను ఎందుకు కూల్చివేయకూడదో వివరించాలని కోరుతూ అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు పంపారు. గతంలో, నటుడు అల్లు అర్జున్ కుటుంబం తమ తాత అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా నవంబర్ 2023లో ఈ నిర్మాణ పనులను ప్రారంభించింది.
గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి అల్లు కుటుంబ వ్యాపారాలకు ప్రధాన కార్యాలయంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, ప్రస్తుతం అనుమతులు లేని నిర్మాణం కారణంగా అధికారులు దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.








