సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై నమోదైన కేసు గురించి నటుడు ప్రియదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన కోర్ట్ సినిమాలో ‘స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ సబ్జెక్ట్లో ఈ కేసు ఉపయోగపడిందని వెల్లడించారు.
ప్రియదర్శి చెప్పిన వివరాల ప్రకారం.. పుష్ప సిసిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి అల్లు అర్జున్ కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోసం న్యాయవాది నిరంజన్ రెడ్డి బన్నీ తరఫున వినిపించిన వాదనలో ఉపయోగించిన భాషను గమనించామని చెప్పారు. ఆ అభ్యాసం ‘కోర్ట్’ సినిమా డబ్బింగ్లో సహజత్వాన్ని తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఇక రామగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.