ప్రముఖ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) గాయంతో బుధవారం చెన్నై (Chennai) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private hospital) లో చేరారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పద్మ భూషణ్ అవార్డును స్వీకరించిన అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి తిరిగివచ్చారు. చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా అభిమానులు హాజరవడంతో ఏర్పడిన గందరగోళంలో అజిత్ కాలి (Leg) భాగానికి స్వల్ప గాయం(Minor Injury)అయినట్లు ఆయన బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు.
“చెన్నై ఎయిర్పోర్ట్లో అభిమానులు ఒక్కసారిగా గుంపుగా రావడంతో అజిత్ సార్ గాయపడ్డారు. దీంతో ఫిజియోథెరపీ (Physiotherapy)కి అవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది” అని వారు తెలిపారు. అజిత్ కుమార్ ఆరోగ్యం పై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆయన బృందం స్పష్టం చేసింది.