అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రెహానే..

Aajink Rahane HD Photo అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రెహానే..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.

ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, టీమిండియా వెటరన్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత ఆటగాడుగా రహానే నిలవనున్నాడు.

ఈ ఘనతతో ధోని, రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లను అధిగమించనున్నాడు. క్రికెట్ ప్రియులు ఇప్పుడు రహానే కొత్త రికార్డు గురించి ఆసక్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment