చీరకట్టులో మెరిసిపోతున్న‌ ఐశ్వర్య రాజేష్

చీరకట్టులో మెరిసిపోతున్న‌ ఐశ్వర్య రాజేష్

నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాల్లో ప్రధానంగా పనిచేసే ఈ అందాల తార, సావిత్రి, సౌందర్య తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్నెట్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
1990 జనవరి 10న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో ఐశ్వర్య రాజేష్ జన్మించింది. ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు కాగా, ఐశ్వర్య చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి. తల్లిదండ్రుల నలుగురు సంతానంలో ఆమె చిన్నది. దురదృష్టవశాత్తు, ఆమె యుక్తవయస్సులో ఇద్దరు అన్నలు మరణించారు. ఆమె తాత అమర్‌నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు. ఆమె అత్త శ్రీ లక్ష్మి 500 పైగా తెలుగు చిత్రాల్లో హాస్యనటిగా నటించారు.

ఐశ్వర్య తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. తమిళనాడులోని చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బి.కామ్ లో డిగ్రీ పట్టా పొందింది.

సినీ ప్రస్థానం
పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ, ఐశ్వర్య ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించి అక్కడ స్టార్‌గా ఎదిగింది. 2019లో స్పోర్ట్స్ డ్రామా ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలు చేసింది, అయితే ఇవి అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఐశ్వర్య రాజేష్ ఇప్పటికే నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment