గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం (Airport)నుంచి లండన్ (London)లోని గ్యాట్విక్ (Gatwick) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) AI171 టేకాఫ్ (Takeoff) అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు, అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం (BJ Medical College Hostel) మీద విమానం కూలడంతో (Crashed) అక్కడి 20 మంది వరకు ఎంబీబీఎస్ విద్యార్థులు (MBBS Students), డాక్టర్లు (Doctors) ప్రాణాలు కోల్పోయినట్లు (Lost Lives) సమాచారం. వైద్యులే ఇలాంటి ఊహించని ఘటనలో మరణించడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అయితే, మెడికోల మృతిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రమాద వివరాలు, సహాయక చర్యలు
కూలిపోయిన బోయింగ్ AI171 విమానంలో సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది ఎయిర్లైన్స్ సిబ్బంది. ప్రయాణికులలో 169 మంది భారతీయులు (Indians), 53 మంది బ్రిటిష్ దేశస్థులు (British Nationals), 1 కెనడియన్ (Canadian), 7 మంది పోర్చుగీస్ పౌరులు (Portuguese Citizens ఉన్నారని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఎయిరిండియా హెల్ప్లైన్ నెంబర్ 1800 5691 444 అందుబాటులో ఉంది.
విమానం అహ్మదాబాద్లోని మేఘానగర్ ప్రాంతంలో (Meghanagar Area), హార్స్ క్యాంప్ (Horse Camp)సమీపంలో, సివిల్ హాస్పిటల్ (Civil Hospital) దగ్గర కూలిపోయింది. విమానం భవనంపై కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వస్త్రపూర్ ప్రాంతంతో సహా చాలా కిలోమీటర్ల దూరం నుండి కనిపించింది, స్థానికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ స్పందన
ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా సమాచారం అందించింది. “ఫ్లైట్ AI171 అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్విక్ వెళుతోంది. జూన్ 12న ప్రమాదానికి గురైంది. మేము ఇంకా వివరాలను పరిశీలిస్తున్నాము. ఈ విషయంలో మా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’, ఎయిర్ ఇండియా వెబ్సైట్లో మరింత సమాచారాన్ని షేర్ చేస్తాము” అని ఎయిర్ ఇండియా తెలిపింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
