గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదం (Plane Crash) ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (Former Gujarat Chief Minister) విజయ్ రూపానీ (Vijay Rupani) సహా 242 మంది మృతి (Died) చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ (London)లోని గాట్విక్ (Gatwick)కు బయలుదేరిన ఏఐ171 విమానం మేఘానినగర్ (Meghaninagar)లోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై (Medical College Hostel Building) కూలిపోయింది. దీంతో భారీ మంటలు, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.. ఈ ప్రమాదంలో మెడికోలు కూడా మృతిచెందినట్లుగా సమాచారం.
గుజరాత్ ప్రభుత్వం ప్రకటన
ఈ దుర్ఘటనలో 242 మంది దురదృష్టవశాత్తూ మృతి చెందినట్లుగా గుజరాత్ ఆరోగ్య శాఖ (Gujarat Health Department,), అహ్మదాబాద్ సీపీ (Ahmedabad CP – Commissioner of Police) వెల్లడించారు. విమానంలో ఉన్నవారు ఎవరూ బ్రతికే పరిస్థితి లేదని సీపీ తేల్చిచెప్పారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, ఈ ప్రమాదానికి గురై బతికి ఉన్నవారి సంఖ్య గురించి ఇంకా ధృవీకరణ లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి, కింగ్ జార్జ్ హాస్పిటల్ (Ahmedabad Civil Hospital, King George Hospital) లో వైద్య సహాయం అందుబాటులో ఉంది” అని తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Chief Minister Bhupendra Patel) గాయపడినవారిని తరలించడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.
విజయ్ రూపానీ: రాజకీయ నేపథ్యం
విజయ్ రూపానీ (Vijay Rupani), 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడిగా, 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1996-97లో రాజ్కోట్ మేయర్గా, 2006-12 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2014-16 మధ్య ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా, శ్రమ, ఉపాధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రూపానీ, 2021లో రాజీనామా చేసి, భూపేంద్ర పటేల్కు స్థానం కల్పించారు. ఈ విమానంలో రూపానీ లండన్లో ఉన్న తన భార్య అంజలీ రూపానీని తీసుకొచ్చేందుకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
కూలిపోయిన బోయింగ్ AI171 విమానంలో సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది ఎయిర్లైన్స్ సిబ్బంది. ప్రయాణికులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశస్థులు, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ పౌరులు ఉన్నారని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది.