అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Accident)పై యావత్ ప్రపంచమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఒక్కరు మినహా విమానంలోని ప్రయాణికులంతా అతిదారుణంగా మృతిచెందడం, ఘటనా స్థలంలోని ప్రయాణికుల మృతదేహాల దృశ్యాలు చూసినవారి హృదయాలన్నీ ఒక్కసారిగా బరువెక్కాయి. ఈ విపత్కర సమయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తీరు (Civil Aviation Minister’s Behavior) దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Ram Mohan Naidu) తన సోషల్ మీడియా రీల్స్ (Social Media Reels)తో విడుదల చేసి దేశపౌరుల ఆగ్రహానికి కారణమయ్యారు. బాధ్యత గల పదవిలో ఉండి విషాద సమయంలో వ్యవహించాల్సిన తీరు ఇదేనా..? అని దేశ ప్రజలు మండిపడుతున్నారు.

విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో వీడియోలు(Videos) చిత్రీకరించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ (Background Music)తో ఎడిట్ చేసి తన ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ (Reels)గా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రామ్మోహన్ కాదు, రీల్స్ మోహన్” (“Not Ram Mohan, Reels Mohan) అంటూ ధ్వజమెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు కేంద్రమంత్రి (Union Minister)ని దుమ్మెత్తి పోస్తున్నారు. శవాల మధ్య రీల్స్ షూట్ చేయడం, సినిమాటిక్ ఎడిటింగ్తో వీడియోలు పోస్ట్ చేయడం సముచితమా అని నిలదీస్తున్నారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మంత్రి వీడియో కింద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

రామ్మోహన్ నాయుడు విజయవాడ (Vijayawada) నుంచి అహ్మదాబాద్ (Ahmedabad)కు చేరుకొని, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సమయంలో రికార్డ్ చేసిన వీడియోలు (Recorded Videos) మూడేసి ఫ్రేమ్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎడిట్ చేసి తన ఎక్స్, ఇన్స్టా ఖాతాల్లో పోస్టు చేసుకున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వదిలిన మరుక్షణం నుంచే ఆయనపై విమర్శల దాడి మొదలై.. నిమిషాల్లోనే అది దేశ వ్యాప్తంగా అంటుకుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రీల్స్పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “డెడ్ బాడీల దగ్గర వీడియో షూటింగ్ ఏంటి సార్? శవాల మధ్య రియల్ హీరోలా సూపర్గా ఉన్నారు,” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, “ఆపత్కాల సమయంలోనూ నీ రీల్స్ పీచ్చి వీడవా? ఇది సందర్భమా నీ ప్రచార యావకు?” అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వీడియోల్లో ఫ్రేమ్ సైజ్ ఇంకొంచెం వైడ్గా పెడితే బాగుండేదేమో రీల్స్ మంత్రి గారూ” అంటూ సెటైర్లు కూడా వచ్చాయి.

ఈ వివాదం రామ్మోహన్ నాయుడును మాత్రమే కాకుండా, ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా తాకింది. “రీల్స్ మంత్రికి సపోర్ట్ చేస్తున్నారు? శవాల దగ్గర షూటింగ్ చేసుకునే వ్యక్తికి మద్దతు ఇస్తారా? మీకు బుద్ధి ఉందా?” అని నెటిజన్లు టీడీపీ నాయకులను దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో కూడా రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా రీల్స్తో ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. విపత్కర సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రి, సినిమా షూటింగ్లా రీల్స్తో కాలక్షేపం చేయడం సరైనది కాదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎక్స్లో కొన్ని వ్యాఖ్యలు మంత్రి బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండించాయి. “విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు టేకాఫ్కు అనుమతించారు? విమానయాన మంత్రిగా భద్రతను నిర్ధారించడం మీ బాధ్యత కాదా?” అని ఒక యూజర్ ప్రశ్నించగా, “బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? సినిమా షూటింగ్ చేస్తున్నారా?” అని మరొకరు విమర్శించారు. “అహ్మదాబాద్లో జరిగిన విషాదాన్ని డ్రామాటిక్ రీల్గా మార్చారు. జస్టిస్ అందించండి, జాజీ ఎడిట్స్ కాదు” అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. ఈ వివాదం రామ్మోహన్ నాయుడు రాజకీయ ఇమేజ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన భద్రత, మంత్రి బాధ్యతలపై విస్తృత చర్చకు దారితీసింది.
Inspected the crash site along with Hon’ble Home Minister Shri @AmitShah ji and briefed him on the details of the incident. Investigations are underway to determine the cause. pic.twitter.com/bmST0EsQZm
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2025