Plane Crash : ఆరు నెలల ముందే యువ‌తి ట్వీట్.. వైరల్

Air India Plane Crash : ఆరు నెలల ముందే ట్వీట్.. వైరల్

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదం (Flight Accident) దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు, ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) మాత్రమే బతికి బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదం గురించి ఆరు నెలల ముందే (Six Months Before) ఓ మహిళ (Woman) ట్వీట్ (Tweet) చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రమాద వివరాలు
గురువారం మధ్యాహ్నం 1:17 గంటలకు, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) నుంచి లండన్‌ (London)లోని గాట్విక్ విమానాశ్రయానికి (Gatwick Airport) బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే మేఘానీనగర్‌ (Meghaninagar)లోని గుజ్‌సెల్ (Guj-Sel) ప్రాంతంలో కుప్పకూలింది. విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై (Medical College Building) పడటంతో భారీ పేలుడు సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 242 మంది మరణించారు, అలాగే భవనంలో 20 మంది మెడికోలు కూడా చనిపోయారు.

ఆస్ట్రో షర్మిష్టా ట్వీట్
ఈ ఘోర ప్రమాదానికి ఆరు నెలల ముందు, 2024 డిసెంబర్ 29న, ‘ఆస్ట్రో షర్మిష్టా’ (Astro Sharmishta) అనే యువతి (Young Woman) తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ చేసింది. “2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే, విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచి వేస్తాయి అని ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ కొన‌సాగింపుగా, ఆమె 2025 జూన్ 5న మరోసారి ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ మ‌రో సందేశాన్ని పొందుప‌రిచింది. “ఓ విమాన ప్రమాదం జరుగుతుందని.. అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నాను” అని పేర్కొంది. ఈ ట్వీట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె అంచనాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్వీట్‌పై చర్చ
ఆస్ట్రో షర్మిష్టా ట్వీట్లు జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నాయా లేక కేవలం ఊహాగానాలా అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. కొందరు ఆమె అంచనాలను “నక్షత్ర ట్రాన్సిట్” (Planetary Transit) ఆధారంగా చేసినవిగా భావిస్తుండగా, మరికొందరు ఇవి అంచనాలు మాత్రమేనని వాదిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తుల ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొనడం వల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ (Saurabh Bhatnagar) మాట్లాడుతూ.. “టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొనడం వల్ల ఇంజన్లు పనిచేయకపోవచ్చు, దీనివల్ల విమానం అవసరమైన వేగం, ఎత్తును చేరుకోలేక‌పోయింది” అని తెలిపారు. అలాగే, విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ‘మేడే’ కాల్ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా, ఈ విమానంలో గతంలో సాంకేతిక లోపాలు గుర్తించినట్లు ఓ ప్రయాణికుడు ఆకాష్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తూ వీడియో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 2024 జూన్ మరియు డిసెంబర్‌లో ఈ విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, DGCA హెచ్చరికలను ఎయిర్ ఇండియా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది, బ్లాక్ బాక్స్ విశ్లేషణ నిజమైన కారణాలను వెల్లడిస్తుందని ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment