వరంగల్ జిల్లాలో అఘోరీ హల్చల్ చేసింది. కొమ్మాల గ్రామ సమీపంలో ప్రత్యక్షమైన అఘోరీని చూసిన గ్రామస్తులు, అతడిని కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరాలు కుంభమేళాలో కోట్ల మంది భక్తులను ఆశీర్వదిస్తుంటే, తెలంగాణలో తిరుగుతూ అఘోరీ హల్చల్ చేయడంపై ప్రజలు ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నకు చిర్రెత్తిపోయిన అఘోరీ, గ్రామస్థులపై దురుసుగా ప్రవర్తించింది.
అఘోరీ తన కారులో గల పెట్రోల్ క్యాన్ చేతబట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటానని స్థానికులను బెదిరించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుండి పంపించినట్లు తెలుస్తోంది.