ప్రముఖ సినీ నటుడు, సూద్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సోనూసూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో కోర్టు ముందు హాజరుకాకపోవడంతో పంజాబ్లోని లుథియానా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మోహిత్ శర్మ అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం చేసాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు.
పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పలుమార్లు సోనూసూద్కు సమన్లు జారీ చేసినప్పటికీ అతను స్పందించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సోనూసూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసును ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కోర్టు సమన్లకు స్పందించకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసు నేపథ్యంలో సోనూసూద్ ఎలా స్పందిస్తారో చూడాలి.