సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆయన నివాసంలో బుధవారం రాత్రి ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లి పీఎస్లో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన నాయకుడు మణి 24వ తేదీన ఫిర్యాదు చేయగా, నిన్న రాత్రి హైదరాబాద్లో పోసాని అరెస్టు జరిగింది. తన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స అనంతరం వస్తానని పోసాని కోరినా ఏపీ పోలీసులు పట్టించుకోకుండా అతన్ని అరెస్టు చేసినట్లుగా వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అక్రమ అరెస్ట్ @ncbn, @naralokesh, @PawanKalyan ను ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు
— YSR Congress Party (@YSRCParty) February 26, 2025
పోసానికి ఆరోగ్యం బాలేదని అతని సతీమణి చెప్తున్నా.. దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలి లోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లిన… pic.twitter.com/jZtO3Pu2Bf
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.
పోసాని అరెస్టుపై హైకోర్టు న్యాయవాది బాల మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధమన్నారు. అరెస్టుకు సంబంధించి ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ నోటీసుల్లో 27వ తేదీ వేశారని, అరెస్టును పూర్తిగా ఖండించారు. బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నామని చెప్పారు.