ఐపీఎల్ (IPL) లో శనివారం పంజాబ్ (Punjab Kings) తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)కు విజయం అందించడంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… జ్వరంతో (Fever) బాధపడుతున్నా అభిషేక్ ఏ మాత్రం వెనుకాడలేదు. దూకుడుగా ఆడి కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు కొట్టి మ్యాచ్ను SRH దిశగా మలిచాడు.
“జ్వరంలో ఉన్నా… మా జట్టులోని సీనియర్లు నాకు ధైర్యం చెప్పారు. ఇది నా కలల ఇన్నింగ్స్(Dream Innings)” అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పేర్కొన్నాడు. అలాంటి సమయంలో ఆటలో చూపిన పట్టుదల, ఫోకస్ చూసి అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్స్ (Destructive Innings) మూలంగా హైదరాబాద్ జట్టు సునాయస విజయం సాధించింది. 20 ఓవర్లకు ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే భారీ స్కోర్ను ఛేదించింది. 245 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకొని 8 వికెట్ల తేడాతో పంజాబ్పై ఘన విజయం (Emphatic Win) అందుకుంది.