యూఏఈతో జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సాధించారు. ఛేజింగ్లో భారత్ తరఫున ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ బాదిన ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతను గతంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సాధించినప్పటికీ, అవి మొదట బ్యాటింగ్ చేసిన సందర్భాల్లోనే జరిగాయి. కానీ ఛేజింగ్లో ఈ రికార్డును నమోదు చేసిన తొలి భారత బ్యాటర్గా అభిషేక్ నిలిచారు.
టీ20లో టాప్ బ్యాటర్గా కొనసాగుతున్న అభిషేక్
ప్రస్తుతం టీ20ల్లో అభిషేక్ శర్మ ఫామ్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన 18 టీ20 మ్యాచ్ల్లో 565 పరుగులు సాధించారు. ముఖ్యంగా, 44 సిక్సర్లు కొట్టి తన పవర్ హిట్టింగ్కు నిదర్శనం చూపిస్తున్నారు. దీంతో ఆయనను టీ20 ఫార్మాట్లో నంబర్ వన్ బ్యాటర్గా పరిగణిస్తున్నారు.