గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో ఆదివారం జరిగింది.
పెదనందిపాడు గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా గుడిసెలో ఉండటాన్ని గమనించిన పాలపర్తి మంజు అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతను 2023, 2024లోనూ రెండు అత్యాచార కేసుల్లో అరెస్టయి, జైలు శిక్ష అనుభవించాడు. రెండ్రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన మంజు ఈ దారుణానికి పాల్పడడం గమనార్హం.