ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అమానుష చర్య చోటు చేసుకుంది. జోజి బాబు (45) అనే వ్యక్తి అతి కిరాతకంగా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి, తగిన చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నిందితుడిపై చర్యలు
నిందితుడు జోజి బాబు బాలిక ఇంటి సమీపంలో ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. చిన్నారుల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని ఇలాంటి ఘటనలు సూచిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణ ఘటనలో ప్రతి రోజూ ఏదో ఒక చోటు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహిళలు, యువతులు, చిన్నారుల భద్రత పట్ల ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా దృష్టిసారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మహిళల కోసం తీసుకొచ్చిన దిశ యాప్ను కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయిన విషయం తెలిసిందే.