2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టును నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే, తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్మిత్ స్పష్టం చేశాడు. అయితే, ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో పాటు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఇవి జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కానుంది.
News Wire
-
01
అమరులకు జనసేన నివాళి
పహల్గామ్ అమరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నివాళి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించిన పవన్
-
02
అమరావతికి ప్రధాని భద్రతా దళం
ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటన. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభ దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీజీ బృందం
-
03
ఉర్సా భూములు వెనక్కి తీసుకోవాలి
విశాఖ రూరల్ తహసీల్దార్ ఆఫీస్ వద్ద సీపీఎం ఆందోళన. ఉర్సా కంపెనీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
-
04
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు. పాకాల మండలం తోటపల్లి వద్ద ప్రమాదం
-
05
బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగత్మకంగా అమలు
-
06
జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
ఆపరేషన్ కగార్ అంశంపై జానారెడ్డితో చర్చిస్తున్న సీఎం రేవంత్. కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని జానాకి అప్పగించే యోచన
-
07
నేడు మేయర్ ఎన్నిక
నేడు జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక. కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కూటమి. నేడు ఉదయం ప్రమాణస్వీకారం
-
08
నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.
వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో ఖాళీ అయిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఓట్లు.
-
09
తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 17, వైఎస్ఆర్ సీపీకి 11 మంది మద్దతు. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత.
-
10
పాకిస్తానీలకు ఏపీ డీజీపీ హెచ్చరిక
ఏపీలో ఉన్న పాకిస్తానీలు తక్షణమే దేశం విడిచి వెళ్లాలి. ఈనెల 27 తర్వాత ఏపీలో ఉంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరిక