పవన్‌తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం!

పవన్‌తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. విజయవాడలో ఈ ఈవెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని దిల్ రాజు వివరించారు.

టికెట్ రేట్లు, సినీ పరిశ్రమ అంశాలపై చర్చ
ఈ భేటీలో టికెట్ రేట్ల పెంపు, పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, తెలంగాణ ప్రభుత్వం అనుమతులు, మరియు బెనిఫిట్ షోల రద్దు వంటి అంశాలపై కూడా పవన్‌తో దిల్ రాజు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల తరువాత దిల్ రాజు మీడియాతో పూర్తి వివరాలను వెల్ల‌డిస్తార‌ని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరవుతారా? ఇవి ఆసక్తికర ప్రశ్నలుగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment