Pushpa 2 Stampede: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు.. 23 మందిపై ఛార్జిషీట్‌

Pushpa 2 Stampede: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు.. 23 మందిపై ఛార్జిషీట్‌

‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌ (Hyderabad) ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ (RTC Cross Roads) లోని సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు (Chikkadpally Police) ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేయగా, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ను ఏ-11గా చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు ఛార్జిషీట్‌లో ఏ-1గా సంధ్య థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ను పేర్కొన్నారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మేనేజర్‌, వ్యక్తిగత సిబ్బంది మరియు ఎనిమిది మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు మోపారు. థియేటర్‌ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రీమియర్‌ షోలో ప్రాణాంతక ఘటన
2024 డిసెంబర్‌ 4న ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా థియేటర్‌ వద్ద భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి (Revathi) అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (Sritej – 9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు పూర్తి చేసి తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో సినీ పరిశ్రమతో పాటు ప్రజల్లోనూ విస్తృత చర్చ కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో కోర్టు విచారణ ఎలా సాగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment