సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన

సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన

నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ మ‌రికొన్ని గంట‌ల్లో భూమి మీద‌కు తిరిగి రానున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీరి ప్రయాణం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో నాసా కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వీరు భూమికి చేరుకుంటారని నాసా తెలిపింది. వీరిని భూమికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక ఇప్పటికే భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

ఎట్టకేలకు సునీత రాకకు మార్గం సుగమం
స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ తిరుగు ప్రయాణం సోమవారం రాత్రి 10.45 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ల్యాండ్ కానుంది. ఆ తర్వాత వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీసుకురావడం జరుగుతుంది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమికి చేరుకుంటారు. 2024 జూన్ 5న బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న వీరికి కేవలం వారం రోజులకే తిరిగి రావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రయాణం దాదాపు తొమ్మిది నెలల పాటు వాయిదా పడింది. మరికొన్ని గంటల్లోనే సునీతా విలియమ్స్ భూమి మీద‌కు చేరుకోనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment