రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. యాచారం (Yacharam) పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతన్ గౌరెల్లి (Manthan Gourelli) గ్రామంలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 90 ఏళ్ల ఒంటరి (90 Years Old Lonely) వృద్ధురాలి (Elderly Woman)పై అత్యాచారం(Rape) జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో, వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తుతెలియని యువకులు (Young Men) ఇంట్లోకి చొరబడ్డారు. తలుపు తట్టి ఆమెను నిద్ర లేపిన దుండగులు, విచక్షణారహితంగా ఆమెపై దాడి (Attack) చేశారు. తిరగబడే శక్తి లేని వృద్ధురాలిపై అత్యాచారం చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
గురువారం ఉదయం, వృద్ధురాలి ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపు తెరిచి చూడగా, ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యం కనిపించింది. భయంతో ఆమె వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. స్థానికులు విషయాన్ని గ్రామ పెద్దలకు, యాచారం పోలీసులకు(Police) తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న యాచారం పోలీసులు, వృద్ధురాలిని వెంటనే సమీపంలోని ఆసుపత్రి (Hospital)కి తరలించి చికిత్స అందజేశారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐ నందీశ్వర్ రెడ్డి (CI Nandeeshwar Reddy) నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో మంతన్ గౌరెల్లి (Manthan Gourelli) గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.