బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

ఛత్తీస్‌గ‌ఢ్‌లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గ‌ఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మ‌రో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది.

ఘటన వివరాలు
2021లో జరిగిన ఈ హృదయవిదారక ఘటనలో ముంజ్వార్ అనే వ్యక్తి, బాలిక మరియు ఆమె తండ్రిని “లిఫ్ట్” ఇస్తానని చెప్పి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం, తన మిత్రులతో కలిసి నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై అత్యాచారం చేసి, ఆమెను మరియు ఆమె తండ్రిని పాశవికంగా హత్యచేశారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

న్యాయస్ధాన తీర్పు
నేర విచారణలో స్పష్టమైన సాక్ష్యాలతో కోర్టు, ఈ ఘోర నేరానికి పాల్పడిన ఐదుగురికి మరణశిక్ష, మరో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కఠినమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు బాధితుల కుటుంబానికి కొంత న్యాయం కలిగించిందని అంతా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment