రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. నహర్గఢ్ (Nahargarh) ప్రాంతంలో మద్యం మత్తు (Drunken State) లో ఉన్న వ్యక్తి ఎస్యూవీ (SUV) వాహనాన్ని కంట్రోల్ చేయలేక రోడ్డుపై నడుస్తున్న జనాలపై దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు (Two People) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా (Died), మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి (Three-Year-Old Child) కూడా ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు కావడంతో, అవి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్గా మారాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. అయితే ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడినుంచి పారిపోయాడు.
ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని అన్నారు. నిందితుడిపై తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఆచార్య (Balmukund Acharya) మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.