ఘోర విమాన ప్ర‌మాదం.. 179కి చేరిన మృతుల సంఖ్య‌

ఘోర విమాన ప్ర‌మాదం.. 179కి చేరిన మృతుల సంఖ్య‌

దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన జేజు ఎయిర్‌ 7C2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకున్న విమానం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో 179 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 175 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండ‌గా, అందులో ఇద్ద‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పక్షి ఢీకొనడం వల్ల ల్యాండింగ్ గేర్‌ సమస్య తలెత్తిందని అనుమానిస్తున్నారు.

ప్రమాదానికి మరిన్ని వివరాలు
విమానం ఇప్పటికే ఒకసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమైందని అధికారులు తెలిపారు. రెండవ ప్రయత్నంలో వేగం నియంత్రించడంలో విఫలమైన విమానం, రన్‌వే చివర్లోని గోడను ఢీకొన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంధనం ఒక్కసారిగా మంటలు రావ‌డంతో విమానం పూర్తిగా కాలిపోయింది.

ఇంజిన్ నుంచి వచ్చిన మంటలను స్థానిక టెలివిజన్ ఛానల్ ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. దక్షిణ కొరియా ఫైర్‌ చీఫ్‌ లీ జియోంగ్‌ హైయూన్‌ ప్రకటన ప్రకారం.. వాతావరణ పరిస్థితులు, పక్షి ఢీకొనడం, లేదా సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. జేజు ఎయిర్‌ సంస్థ ఈ ఘోర ప్రమాదంపై క్షమాపణలు చెప్పింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 1997లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఇది మరో పెద్ద ప్రమాదం.

Join WhatsApp

Join Now

Leave a Comment