టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన పాత బ్రాండ్ భాగస్వామ్యానికి గుడ్బై (Goodbye) చెప్పేశాడు. 2017లో అప్పారెల్ బ్రాండ్ పూమాతో రూ.110 కోట్లకు 8 ఏళ్ల ఒప్పందం చేసుకున్న కోహ్లీ, తాజాగా ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్నాడు. పూమా (Puma) మరోసారి భారీగా సుమారు రూ.300 కోట్ల డీల్ (Deal)కి సిద్ధంగా ఉన్నప్పటికీ, విరాట్ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇకపై తన సొంత బ్రాండ్ (Own Brand) ‘వన్ (One)’కు ప్రమోషన్ (Promotion) ఇచ్చే దిశగా కోహ్లీ ముందడుగు వేశాడని సమాచారం. స్వంత బ్రాండ్ను నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
విరాట్ కోహ్లీ క్రికెటర్గానే కాకుండా బిజినెస్ మెన్ (Businessman) గానూ సంచలనం సృష్టిస్తున్నాడు. యాడ్స్తో భారీగా డబ్బులు కూడబెట్టుకుంటూనే హోటల్, క్లాత్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఆ రంగాల్లోనూ మంచి లాభాలు అందుకుంటున్నాడు. కాగా, కోహ్లీకి చెందిన మరో బ్రాండ్ వన్8 (One8) కంపెనీని గ్లోబల్ మార్కెట్ (Global Market) రేంజ్లో నిలబెట్టేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్, ఫుట్ వేర్ వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వన్ 8ను మరింత విస్తరించాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడు.