కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ ఎలక్ట్రిక్ సైకిల్ యాడ్ షూట్లో పాల్గొన్నారు. విశేషమేంటంటే, దీనికి డైరెక్షన్ అందించినవారు ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘యానిమల్’ సినిమా స్టైల్లో ధోనీ కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సైకిల్పై స్టైలిష్గా రైడ్ చేస్తూ, తనదైన యాటిట్యూడ్తో కనిపించిన ధోనీ లుక్కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ యాడ్ షూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ, రణబీర్ గ్యాంగ్లో భాగమయ్యారా? లేక ఇది కేవలం యాడ్ షూట్ కోసమేనా? అనేది అభిమానులు ఆసక్తిగా కామెంట్లు పెడుతున్నారు. యాడ్లో ధోనీ లుక్లో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ధోనీ కెప్టెన్ కూల్ నుంచి ప్రత్యేకమైన హెయిర్ స్టైల్లో యానిమల్ పాత్రలో కనిపించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.