రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో(CEO) దర్శన్ మెహతా (Darshan Mehta) హఠాన్మరణం (Sudden Demise) చెందారు. 64 ఏళ్ల మెహతా గుండెపోటు (Heart Attack) తో బుధవారం తుదిశ్వాస విడిచారు. దర్శన్ మెహతా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వ్యాపార వ్యవస్థాపకుడిగానే కాకుండా, ఆయన ఒక మిడ్-డిస్టెన్స్ రన్నర్, హిమాలయ పర్వతారోహకుడిగా కూడా ప్రత్యేకంగా నిలిచారు. గత నవంబర్ వరకు ఆయన RBL మేనేజింగ్ డైరెక్టర్ (Managing Director) గా పనిచేశారు. అనంతరం ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా మరణించడం కార్పొరేట్ వర్గాల్లో విషాదాన్ని కలిగించింది.
News Wire
-
01
ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు
ఇవాళ మరో రూ. 6,500 కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.వారం క్రితం రూ. 4వేల కోట్లు అప్పు చేసిన సర్కార్
-
02
సీఆర్ డీఏ సమావేశం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలు, భూ సమీకరణపై చర్చ..
-
03
కొయ్యలగూడెంలో టీడీపీ నేతల గూండాయిజం
రవితేజ అనే యువకుడిపై బీరుసీసాలతో దాడి. పోలవరం టీడీపీ ప్రచార కార్యదర్శి మదన్ ఆధ్వర్యంలో దాడి. ఆసుపత్రికి తరలింపు
-
04
టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపు
బాపట్లలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాలకి ఎకరానికి రూ.1000/- చొప్పున అద్దెకు కేటాయింపు
-
05
విశాఖ లో డ్రగ్స్ కలకలం.
ఎంవీపీ సెక్టర్ 11లో డ్రగ్స్ పట్టివేత. 4.5 గ్రామూల MDMA , 5.5 కిలోల గంజాయి స్వాధీనం
-
06
మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు
విశాఖ AISF, AIYF నేతలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్. గుంటూరులో భారీ ర్యాలీ
-
07
అన్నమయ్య జిల్లా విభజనపై వైసీపీ ఆందోళన..
జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంపై నిరసన.రాయచోటిలో పెద్దఎత్తున ర్యాలీలు చేస్తున్న వైయస్ఆర్సీపీ
-
08
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
20 ఏళ్ల తర్వాత ఏకమవుతున్న ఠాక్రే సోదరులు. మీడియా సమావేశం నిర్వహించిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే
-
09
కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన నేపథ్యంలో వివాదం . ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కొట్లాట
-
10
వైయస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దు
జ్వరం కారణంగా సెమీక్రిస్మస్ వేడుకలకు దూరం. పులివెందుల నివాసంలోనే జగన్ గారు విశ్రాంతి.








