చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ తరహా మోసాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబైలో అనేక కేసులు నమోదయ్యాయి.

మోసానికి ఉపయోగించిన వ్యూహం
నాగరాజు వాట్సాప్ ద్వారా చంద్ర‌బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ పేరుతో పలువురికి సందేశాలు పంపి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన క్రికెటర్ రికీ భుయ్‌కు స్పాన్సర్ చేయాలంటూ, క్రీడా కిట్ల కోసం డబ్బులు పంపించాలని కోరాడు. అనుమానం వచ్చిన కొందరు శ్రీనివాస్‌ను సంప్రదించగా, అసలు విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో విజయవాడ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ టీమ్‌ దర్యాప్తు ప్రారంభించింది.

మోసాల గత చరిత్ర
2014-2016 మధ్య రంజీ క్రికెట్ ఆడిన నాగరాజు, ఆ తర్వాత క్రికెట్ కెరీర్ ముగింపు ప‌లికారు. అనంత‌రం మోసాల వైపు మొగ్గుచూపాడు. గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్లను ఉపయోగించుకొని కార్పొరేట్ కంపెనీలను మోసం చేశాడు. గంజాయి సరఫరా వంటి కేసుల్లోనూ అతని పేరు రావడం అతని నేర చరిత్ర మరింత తీవ్రమైనదిగా చేస్తోంది.

సాంకేతికతను ఉపయోగించి మోసాలు
నాగరాజు వాట్సాప్ డిస్‌ప్లే ఫోటోలో ప్రముఖుల చిత్రాలను ఉపయోగించి, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి, అమాయకులను మోసం చేస్తున్నాడు. ప్రస్తుత దర్యాప్తులో అతని మోసాలకు సంబంధించిన అనేక కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment